ఆంధ్రప్రదేశ్లోని రైతులకు
శుభవార్త! రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభానికి
తుది ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పథకంలో లబ్ధిదారుల తుది జాబితాను ఇప్పటికే
సిద్ధం చేశారు. మొత్తంగా 46.64 లక్షల మంది రైతులు ఈ పథకం
లబ్ధిదారులుగా ఎంపికయ్యారు. ఆగస్టు 2, 2025న వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ నిధులను రూ.2 వేలు విడుదల
చేయనున్నారు. అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం తనవంతుగా రూ.5 వేలు మంజూరు
చేస్తోంది. ఈ రెండు కలిపి ప్రతి రైతు ఖాతాలో మొత్తం రూ.7,000 జమ
కానుంది.
పథక
ప్రారంభ తేదీ:
ఆగస్టు 2న వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘పీఎం కిసాన్’ పథకం
ద్వారా రైతులకు రూ.2
వేల చొప్పున అన్నదాత సుఖీభవ నిధుల విడుదల చేయనున్నారు.
ఈ పథకం ముఖ్య లక్ష్యాలు ఏమిటి?
అన్నదాత సుఖీభవ పథకం ప్రధాన లక్ష్యం రాష్ట్రంలోని రైతుల ఆర్థిక
స్థితిని మెరుగుపర్చడం. ఖరీఫ్ పంటల సాగు ప్రారంభానికి ముందే ఈ నిధులు అందడం వల్ల
రైతులు అవసరమైన విత్తనాలు, ఎరువులు తదితర సాగు పరికరాలను సమయానికి కొనుగోలు
చేసుకోవచ్చు. దీని ద్వారా వ్యవసాయ పెట్టుబడులపై వచ్చే భారం చాలా మేర తగ్గుతుంది. ఈ
ఆర్థిక మద్దతుతో రైతులు సాగులో దృష్టిని కేంద్రీకరించి, మెరుగైన
దిగుబడులు సాధించగలుగుతారు. వ్యవసాయాన్ని ఆదుకోవడమే కాకుండా, రైతునే దేశానికి పునాది అనే భావనకు ఈ పథకం మద్దతుగా నిలుస్తోంది.
ప్రభుత్వం
తీసుకున్న చర్యలు
- లబ్ధిదారుల జాబితా శుద్ధి
- బ్యాంకు ఖాతాల సమీక్ష
- నిధుల సురక్షిత బదిలీకి డిజిటల్
విధానం
- జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షణ
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే
అదనపు మద్దతు:
అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం “అన్నదాత సుఖీభవ” పథకాన్ని అధికారికంగా ప్రారంభించబోతోంది. ఈ పథకం
కింద, కేంద్ర ప్రభుత్వం అందించే రూ.2 వేలకు అదనంగా రాష్ట్ర
ప్రభుత్వం రూ.5 వేలు కలిపి, రైతుల
బ్యాంక్ ఖాతాల్లోకి మొత్తం రూ.7 వేలు నేరుగా జమ చేయనుంది.
ఈ నిధులతో రైతులు ఖరీఫ్ పంటల సాగుకు అవసరమైన
విత్తనాలు, ఎరువులు, సాగు పరికరాలు కొనుగోలు చేసుకోవచ్చు. ఇది
రైతులకు ఆర్థిక భరోసా కలిగించే కీలక అడుగు!
Website link – Click Hear
0 Comments